12, మే 2017, శుక్రవారం

పద్యాల తో "రణం": ఎనిమిదవ భాగం

"పగలే నిశిమయ్యే ననగ వగపులు కలుగన్" - కులశేఖర రావు మడుపు

1) సాయి సోమయాజుల

తెగ పెంచిన నల్ల ధనము తో
ధగ ధగ మని మెరిసేనొకడు
భగ భగ మని మండే నిపుడు
పగలే నిశిమయ్యే వగపులు కలుగన్

2) మధుబాల కరవది

ప్రక్రుతి భీకరమై గర్జించిన వేళ
ఆదరించే నేల కంపించి కొపించిన వేళ
సముద్రాలు సునామిలుగ చెలరేగిన వేళ
పగలే నిశిమయ్యే ననగ వగపులు కలుగన్

3) శేషు అప్పారావు

వెలవెల బోయె వృక్షవాటికలు ఆ మంచు తెరలో

వలస బోయె నెచటికో ఆ గువ్వల జంటల బారులు

ఆదిత్యుడస్తమించె హంగైన సమయాన పశ్చామాద్రిన్

పగలే నిశిమయ్యే వగపులు కలుగన్

4) సావన్ సోమయాజుల

దక్షుని ఇంట దాక్షాయని దహించుకుపోయేనని


దక్షిణా మూర్తికిన్ తెలియగనే యాతను తృతీ


యాక్షువున్ తెరచె నా విపరీత భయాన


క క్షణమున పగలే నిశిమయ్యే ననగ వగపులు కలుగన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి